పోలవరం గ్రామంలో పిచ్చికుక్క కాటుకు గురైన వృద్ధుడు
చాట్రాయి ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ బి సునీత సకాలంలో స్పందన
ఏలూరు జిల్లా : నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సోమవారం సాయంత్రం పిచ్చికుక్క దాడి చేసింది. గ్రామానికి చెందిన తాణంకి సరవయ్య (60)పై సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పిచ్చికుక్క దాడి చేసి పిక్క పట్టుకుని కరవడంతో ఆయనకు గాయాలు అయ్యాయి.
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సరవయ్యను చాట్రాయి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ బి. సునీత వెంటనే స్పందించి సరవయ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తూ పంపించారు.
గ్రామంలో పిచ్చికుక్క సంచారం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.