BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

కంగనా రనౌత్ వ్యాఖ్యలు గర్హనీయం: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Jul, 2026 - 06:24 AM
69 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: ఢిల్లీలో నీట్ పరీక్షల కుంభకోణానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడిన విద్యార్థి ఉద్యమాన్ని, జన్ జీ నాయకత్వాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ విమర్శించారు. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, ప్రజా వ్యతిరేక విధానాలను దేశ ప్రజల ముందు బహిర్గతం చేయడంలో జన్ జీ ఉద్యమం విజయవంతమైందన్నారు. నీట్ కుంభకోణం కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి "చలో పార్లమెంట్" ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్‌లతో దాడులు చేయడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జలియన్‌వాలా బాగ్ ఘటనను గుర్తు చేసిందని హరినాథ్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. నీట్ కుంభకోణానికి బాధ్యత లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ పరిణామాలతోనే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఉద్యమకారులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారులను "గట్టర్ జనరేషన్", "మురికి కాలువల తరం" అంటూ కించపరిచినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం మానుకోవాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి, ప్రజల్లో చైతన్యం కలిగించాయని హరినాథ్ అన్నారు. 

చివరగా, ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.