BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

రెడ్డిగూడెం మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా గుంటక వంశీకృష్ణారెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Jul, 2026 - 06:24 AM
53 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా గుంటక వంశీకృష్ణారెడ్డి (చింటూ) నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి గుంటక వంశీకృష్ణారెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

యువతకు నాయకత్వం వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మండలంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.