రెడ్డిగూడెం మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా గుంటక వంశీకృష్ణారెడ్డి నియామకం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా గుంటక వంశీకృష్ణారెడ్డి (చింటూ) నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి గుంటక వంశీకృష్ణారెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
యువతకు నాయకత్వం వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మండలంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.