BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

గడ్డి మందులపై నిషేధం విధించాలి: రైతు కమిషన్ విజ్ఞప్తి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 04:30 PM
36 వీక్షణలు

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి, కలుపు మందులను తక్షణమే నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేసింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70కు పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను ఇప్పటికే నిషేధించినప్పటికీ, మన దేశంలో ఇవి ఇంకా విచ్చలవిడిగా విక్రయమవుతున్నాయని కమిషన్ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో ఈ మందులను తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విష రసాయనాలను నిషేధించాల్సిన అవసరం ఉందని, వైద్యుల సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయని కమిషన్ పేర్కొంది. తెలంగాణలో ఈ మందుల విక్రయాన్ని వెంటనే నిలిపివేయడంతో పాటు, దేశవ్యాప్తంగా నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతకమైన విష రసాయనాలపై రాష్ట్రంలో నిషేధం విధించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.