BREAKING
​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత
www.ntodaynews.com

విద్యార్థులకు విద్యా మెటీరియల్ పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
10 Mar, 2026 - 04:52 AM
382 వీక్షణలు

8వ వార్డు మెంబర్ కొమ్ము నగేష్ ప్రోత్సాహం

NTODAY NEWS: బొమ్మలరామారం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. గ్రామ సర్పంచ్ బట్కీరు బీరప్ప జన్మదినం సందర్భంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ 8వ వార్డు మెంబర్ కొమ్ము నగేష్ పాఠశాల అధ్యాపకుల సమక్షంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేలు వంటి విద్యా మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము నగేష్ మాట్లాడుతూ, పదవ తరగతి ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు వాహనదారులు సహకరించాలని కోరారు. విద్య జీవితంలో అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగినేనిపల్లి గ్రామ ఉపసర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, గులన్ గణేష్, ఇప్పలపల్లి కుమార్, బొమ్మగల నగేష్, ముడుగుల నరసింహ, మద్దూరి విజయ్, బొమ్మగల సురేష్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. #EducationSupport #SchoolStudents #Bommalaramaram #YadadriBhuvanagiri #NTodayNews #StudentSupport Follow us on Website Facebook Instagram YouTube