BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

హద్దు మీరిస్తే కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ
06 Jan, 2026 - 04:33 AM
309 వీక్షణలు

మహిళలు, బాలికలపై హద్దు మీరిస్తే కఠిన చర్యలు తప్పవు

-జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ NTODAY NEWS: ఉయ్యాలవాడ గ్రామం ఉయ్యాలవాడ గ్రామంలోని గీతాంజలి కళాశాలలో షీ టీం, సైబర్ క్రైమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, భరోసా విభాగాల ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై ఎవరైనా హద్దు మీరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు భయంలేకుండా, స్వేచ్ఛగా జీవించేలా సురక్షిత వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. షీ టీం అవగాహన షీ టీం ఇంచార్జ్ విజయలక్ష్మి మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై జరిగే ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, అసభ్య ప్రవర్తన, ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులపై షీ టీమ్స్ వెంటనే స్పందిస్తాయని తెలిపారు. సహాయం కోసం డయల్ 100 లేదా 8712657676 నంబర్లకు కాల్ చేయవచ్చని, ఫిర్యాదులను గోప్యంగా ఉంచి తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ అవగాహన సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రమాదేవి “స్టే సేఫ్” అంశంపై మాట్లాడుతూ, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల గురించి వివరించారు. ఎలాంటి సైబర్ మోసాలకు గురైనా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్‌ఐ రజిత మాట్లాడుతూ, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనుమతి లేకుండా మనుషులను బలవంతంగా తీసుకెళ్లడం, అమ్మడం, అవయవాల అక్రమ వ్యాపారం వంటి మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భరోసా సేవలు భరోసా కోఆర్డినేటర్ శ్రీలత భరోసా సెంటర్ ద్వారా మహిళలు, పిల్లల నేర బాధితులకు ఒకేచోట అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసుల్లో భయంలేని వాతావరణంలో సహాయం, బాధితుల గోప్యత, గౌరవం, భద్రతకు అధిక ప్రాధాన్యతతో పాటు విక్టిమ్ కంపెన్సేషన్ ఫండ్, పునరావాసం, విద్య, ఆరోగ్య సహాయాన్ని అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సభ్యుడు రవి, షీ టీం సభ్యులు వెంకటయ్య, వెంకట్, కళాశాల ప్రిన్సిపాల్ శరత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube