రామెళ్ళ వారి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుప్పి రెడ్డి వెంకట రెడ్డి
రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామానికి చెందిన రామెళ్ళ రామకృష్ణ–శ్రీమతి నాగపావని దంపతుల కుమారుడు దేవాన్స్ బాబురావు అన్నప్రాసన కార్యక్రమం మైలవరం మండలం బొర్రగూడెం గ్రామంలోని తిరుపతమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. దేవాన్స్ బాబురావు ఆయురారోగ్యాలతో పెరిగి భవిష్యత్తులో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చాట్ల రాబర్ట్, జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ గుడిసె ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, యూత్ అధ్యక్షులు గుంటక వంశీకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు అలవాల శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడూరి వెంకట నరసయ్య, శాలివాహన మాజీ డైరెక్టర్ రామెళ్ళ మాణిక్యం, ఎంపీటీసీ ప్రసాద్, బాడ్స శ్రీను తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.