www.ntodaynews.com
రాష్ట్ర స్థాయిలో రికార్డుస్థాయి రక్తదానం.. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్కు అవార్డు
తెలంగాణ
/
హైదరాబాద్
/
హిమాయత్నగర్
అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రాజభవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 'కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్'కు ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు వరించింది. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రికార్డు స్థాయిలో రక్తపు యూనిట్లను సేకరించిన విశేష సేవలకు గుర్తింపుగా ట్రస్ట్కు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తనయుడు చరణ్ రావు రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రెడ్క్రాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు