BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​సింగరేణి సర్వతోముఖాభివృద్ధికి సమిష్టి కృషి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 05:15 PM
333 వీక్షణలు

​కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు

​సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేసిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమానికి ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గనిలో రక్షణ పద్ధతులు, గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, నిల్వ, రవాణా తదితర అంశాలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆస్తి అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. తమ చెమటోడ్చి దేశానికి వెలుగులు పంచుతున్న కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, దీనిని అపహాస్యం చేస్తూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.

​కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం అధునాతన వైద్య విధానాలను అందుబాటులోకి తెస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా కార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల'ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ బడులను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల భారీ ప్రమాద బీమా కల్పించామని, అలాగే వారి పిల్లలు యూపీఎస్సీ  తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో గనుల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సీఎంఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డీసీపీ ఎ. భాస్కర్, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

​సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేసిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమానికి ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గనిలో రక్షణ పద్ధతులు, గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, నిల్వ, రవాణా తదితర అంశాలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆస్తి అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. తమ చెమటోడ్చి దేశానికి వెలుగులు పంచుతున్న కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, దీనిని అపహాస్యం చేస్తూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.

​కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం అధునాతన వైద్య విధానాలను అందుబాటులోకి తెస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా కార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల'ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ బడులను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల భారీ ప్రమాద బీమా కల్పించామని, అలాగే వారి పిల్లలు యూపీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో గనుల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సీఎంఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డీసీపీ ఎ. భాస్కర్, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు