www.ntodaynews.com
నూతన తహశీల్దార్గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
నూతన తహశీల్దార్గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
నాదెండ్ల మండల నూతన తహశీల్దార్గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కూడా ఆయన ఇక్కడ తహశీల్దార్గా సమర్థవంతంగా విధులు నిర్వహించి, ప్రజల మన్ననలు పొందారు. తాజాగా జరిగిన బదిలీల నేపథ్యంలో, చంద్రశేఖర్ నాదెండ్ల మండల తహశీల్దార్గా తిరిగి ఇక్కడే బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయ సిబ్బంది, స్థానిక రెవెన్యూ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు.