www.ntodaynews.com
ఓపీఎస్ పునరుద్ధరణపై ఉద్యోగుల కృతజ్ఞత సభ..
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
ఓపీఎస్ పునరుద్ధరణపై ఉద్యోగుల కృతజ్ఞత సభ.. సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం
గుంటూరు జిల్లా మంగళగిరిలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యోగులు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఓపీఎస్ను పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా "థాంక్యూ సీఎం సార్" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను మళ్లీ ఓపీఎస్లోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేశారని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.