www.ntodaynews.com
సింగరేణి నష్టాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం: కిషన్ రెడ్డి
జాతీయం
సింగరేణి నష్టాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి ఆదాయానికి గండి పడిందని, పదేళ్ల పాలనలో సంస్థను నష్టాల బాట పట్టించారని ఆరోపించారు.
సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.54 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రధాన కారణమని కిషన్ రెడ్డి ఆరోపించారు.