వైద్య చికిత్సకు ఆర్థిక సాయం ఆపదలో అండగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.. రూ.6.11 లక్షల ఎల్వోసీ మంజూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నరదల దుర్గారావు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నివాసానికి చేరుకుని తన పరిస్థితిని వివరించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం రూ.6,11,000 విలువైన ఎల్వోసీ లేఖను మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.
ప్రజా సమస్య ఏదైనా, సమయం ఎంతైనా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే తన బాధ్యతగా భావిస్తూ ఎమ్మెల్యే స్పందించిన తీరుపై బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే సేవాభావానికి ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది.