వరంగల్లో సెప్టెంబర్ 12న నేషనల్ లోక్ అదాలత్
ట్రాఫిక్ కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం.. సీజ్ చేసిన వాహనాలపై కూడా పోలీసుల సూచనలు
వరంగల్ | Ntoday News
వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న వరంగల్ 2వ క్లాస్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కూడా సెప్టెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా మూడో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ లోక్ అదాలత్లో అర్హత ఉన్న డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్, మైనర్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అనుకూలమైన కేసులను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా 2020 నుంచి 2024 మధ్య కాలంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాల యజమానులు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలతో సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి వాహనాలను తీసుకెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ కేసులు, వాహనాలకు సంబంధించిన వ్యవహారాలను చట్టబద్ధంగా పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.