తెల్లదేవరపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విస్సన్నపేట, సెప్టెంబర్ 11: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో గ్రామ శివారు రహదారిపై ప్రమాదం జరిగినట్లు విస్సన్నపేట పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినా, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించేందుకు ప్రజలు సహకరించాలని విస్సన్నపేట ఎస్సై విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిసిన వారు 9440796453, 8333947100 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని పోలీసులు సూచించారు.