www.ntodaynews.com
అయోధ్య విరాళాల చోరీ కేసు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జాతీయం
అయోధ్య విరాళాల చోరీ కేసు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అయోధ్యలోని ఆలయ విరాళాల చోరీ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తు కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
సిట్ బృందంలో తప్పనిసరిగా ఫోరెన్సిక్ ఆడిటర్ను చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్ను ఆదేశించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది, ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను పారదర్శకత కోసం అధికారిక వెబ్సైట్లో వెల్లడించాలని కోర్టును కోరారు. ఈ అంశంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకోనుంది.