BREAKING
గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్
www.ntodaynews.com

బస్సులో సీటు ఇవ్వకపోవడం సేవా లోపమే..

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 06:45 AM
27 వీక్షణలు

బస్సులో సీటు ఇవ్వకపోవడం సేవా లోపమే.. ఆర్టీసీకి రూ.15 వేల నష్టపరిహారం విధించిన వినియోగదారుల కమిషన్

కాకినాడకు చెందిన అఖిల్ అనే ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు రూ.85 చెల్లించి టికెట్ కొనుగోలు చేశాడు. అయితే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో అతనికి కూర్చునే సీటు లభించలేదు. దీంతో తాను ఎదుర్కొన్న అసౌకర్యంపై స్థానిక వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు.

వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ప్రయాణికుడు వినియోగదారుడేనని, చెల్లించిన సేవను పూర్తి స్థాయిలో అందించాల్సిన బాధ్యత రవాణా సంస్థపై ఉంటుందని కమిషన్ పేర్కొంది. సురక్షితమైన, కనీస సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని కల్పించడంలో విఫలమైతే అది సేవా లోపంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. అలాగే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం మోటారు వాహనాల చట్ట నిబంధనలకు కూడా విరుద్ధమని పేర్కొంది.

కేసును విచారించిన కమిషన్, టికెట్ తీసుకున్న ప్రయాణికుడికి సీటు కల్పించకపోవడం సేవా లోపమేనని నిర్ధారించింది. ప్రయాణంలో ఎదురైన శారీరక, మానసిక అసౌకర్యానికి గాను ఆర్టీసీ రూ.15,000 నష్టపరిహారం చెల్లించాలని, అదనంగా టికెట్ ధర రూ.85ను కూడా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఈ తీర్పు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. సేవలో లోపం జరిగినప్పుడు టికెట్, ఫోటోలు, వీడియోలు వంటి ఆధారాలతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయిస్తే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై కూడా న్యాయం పొందే అవకాశం ఉంటుందని ఈ కేసు స్పష్టం చేసింది.