www.ntodaynews.com
ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు? తెలంగాణలో 2.5 లక్షల మందికి శుభవార్త!
తెలంగాణ
/
హైదరాబాద్
ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు? తెలంగాణలో 2.5 లక్షల మందికి శుభవార్త!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుపై కసరత్తు వేగవంతం చేసింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దశలో సుమారు 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మొదటి విడతలో ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రాథమిక స్థాయిలోనిదే.