www.ntodaynews.com
రెడ్డిగూడెంలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై శ్రీను
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రామంలో ఎస్సై శ్రీను ఆదివారం విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ సెక్యూరిటీ, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై శ్రీను సూచించారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన తెలిపారు.
ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరుతూ, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై శ్రీను ప్రజలకు విజ్ఞప్తి చేశారు.