గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు
గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు
అమరావతి: 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నిధులతో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 238 పాత, కొత్త పుష్కరఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుష్కరఘాట్లను ఆధునీకరించడంతో పాటు నదీ తీరాలను సుందరీకరించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పుష్కరాల సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.