కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం
కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం
జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
కాకినాడ | N Today News
కాకినాడ–హిసార్ (హర్యానా) మధ్య వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ రైలు సేవను మంగళవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో గౌరవ కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సేవను రెగ్యులర్ రైలుగా కొనసాగించాలని ఎంపీ గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు కోరగా, ఆయన ఆమోదం తెలిపినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది.
ఈ రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుంచి బయలుదేరి చర్లపల్లి, బాసర, అజ్మీర్ మార్గంగా హిసార్ జంక్షన్కు చేరుకుంటుంది.
ఈ రైలు సేవ ద్వారా బాసర, అజ్మీర్ వంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా చేరుకునే సౌకర్యం కలగడంతో పాటు భక్తులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని ఎంపీ తెలిపారు. ప్రజలందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.
– ఎంపీ క్యాంపు కార్యాలయం, కాకినాడ