BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 01:36 PM
54 వీక్షణలు

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం

జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

కాకినాడ | N Today News

కాకినాడ–హిసార్ (హర్యానా) మధ్య వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ రైలు సేవను మంగళవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లో గౌరవ కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సేవను రెగ్యులర్ రైలుగా కొనసాగించాలని ఎంపీ గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు కోరగా, ఆయన ఆమోదం తెలిపినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది.

ఈ రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుంచి బయలుదేరి చర్లపల్లి, బాసర, అజ్మీర్ మార్గంగా హిసార్ జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఈ రైలు సేవ ద్వారా బాసర, అజ్మీర్ వంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా చేరుకునే సౌకర్యం కలగడంతో పాటు భక్తులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని ఎంపీ తెలిపారు. ప్రజలందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.

– ఎంపీ క్యాంపు కార్యాలయం, కాకినాడ