BREAKING
బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు
www.ntodaynews.com

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 01:36 PM
18 వీక్షణలు

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం

జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

కాకినాడ | N Today News

కాకినాడ–హిసార్ (హర్యానా) మధ్య వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ రైలు సేవను మంగళవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లో గౌరవ కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సేవను రెగ్యులర్ రైలుగా కొనసాగించాలని ఎంపీ గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు కోరగా, ఆయన ఆమోదం తెలిపినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది.

ఈ రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుంచి బయలుదేరి చర్లపల్లి, బాసర, అజ్మీర్ మార్గంగా హిసార్ జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఈ రైలు సేవ ద్వారా బాసర, అజ్మీర్ వంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా చేరుకునే సౌకర్యం కలగడంతో పాటు భక్తులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని ఎంపీ తెలిపారు. ప్రజలందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.

– ఎంపీ క్యాంపు కార్యాలయం, కాకినాడ