రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు!
రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు!
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల నమోదు, విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం రైతులు ఆర్బీకే కేంద్రానికి వస్తున్నప్పటికీ అక్కడ సమాధానం చెప్పేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ప్రభుత్వం రైతులకు అన్ని సేవలు గ్రామ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినా, ఎండపల్లి ఆర్బీకేలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉండకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.
వ్యవసాయానికి సంబంధించిన కీలక సమాచారం కోసం వచ్చిన రైతులకు సరైన స్పందన లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆర్బీకేలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.