BREAKING
5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
www.ntodaynews.com

రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 01:27 PM
95 వీక్షణలు

రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు!

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల నమోదు, విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం రైతులు ఆర్‌బీకే కేంద్రానికి వస్తున్నప్పటికీ అక్కడ సమాధానం చెప్పేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ప్రభుత్వం రైతులకు అన్ని సేవలు గ్రామ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినా, ఎండపల్లి ఆర్‌బీకేలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉండకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.

వ్యవసాయానికి సంబంధించిన కీలక సమాచారం కోసం వచ్చిన రైతులకు సరైన స్పందన లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆర్‌బీకేలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.