మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.10 వేల జరిమానా
మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.10 వేల జరిమానా
- డ్రంక్ అండ్ డ్రైవ్లో ట్రైలర్ డ్రైవర్కు కోర్టు శిక్ష
సత్యసాయి జిల్లా | అమడగూరు | N Today News
మద్యం సేవించి వాహనం నడుపుతున్న ట్రైలర్ డ్రైవర్ను అమడగూరు పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లమాడ సీఐ ఆధ్వర్యంలో అమడగూరు ఎస్ఐ గోపాలకృష్ణ, సిబ్బంది రమేష్, గంగాధర్, చంద్ర సోమవారం అర్ధరాత్రి మండల పరిధిలోని మహమ్మదాబాద్ టీ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా TN 18 BX 8840 నంబర్ గల మహీంద్రా బ్లాజో X40 ట్రైలర్ను నడుపుతున్న హెన్రీ ఎబనేజర్ అలెగ్జాండర్ జయరాజ్ (34) మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో అతనిపై కేసు నం. 48/2026, సెక్షన్ 185 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు రూ.10 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ గోపాలకృష్ణ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.