www.ntodaynews.com
NMMSలో సారిపల్లి విద్యార్థుల సత్తా.. ముగ్గురికి ప్రతిభ
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
NMMSలో సారిపల్లి విద్యార్థుల సత్తా.. ముగ్గురికి ప్రతిభ
సారిపల్లి: నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు NMMS (National Means-cum-Merit Scholarship) పరీక్షలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు.
గ్రామానికి చెందిన మజ్జి ఉదయశ్రీ ప్రథమ స్థానం, ఎస్. బాబుసాయి ద్వితీయ స్థానం, ఎం. జ్యోతి తృతీయ స్థానం సాధించి సత్తా చాటారు. విద్యార్థుల ప్రతిభ పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని గ్రామస్థులు పేర్కొన్నారు. మరెంతో మంది విద్యార్థులకు వీరు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.