BREAKING
డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం
www.ntodaynews.com

పెనుగోలను గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Aug, 2026 - 11:09 AM
38 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో బుధవారం జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమ అభివృద్ధిలో రంగనాథన్‌ కీలక పాత్ర పోషించారని తెలిపారు. గ్రంథాలయ శాస్త్రంపై అనేక విలువైన గ్రంథాలను రచించి, దేశంలో గ్రంథాలయ వ్యవస్థకు పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.

రంగనాథన్‌ 1945–47 మధ్య బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ గ్రంథపాలకుడిగా, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడిగా సేవలందించారని తెలిపారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారని చెప్పారు. భారతీయ గ్రంథాలయ సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారని వివరించారు. 1957లో అంతర్జాతీయ సమాచార, పత్రాల సమాఖ్య గౌరవ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు.

గ్రంథాలయ రంగానికి రంగనాథన్‌ చేసిన విశేష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని కొనియాడారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవర నరసింహారావు, అలుగుల వెంకటరమణ, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.