www.ntodaynews.com
పుట్లగట్లగూడెం వద్ద వోల్వో బస్సు ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవే టోల్ప్లాజా వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు మరో నలుగురి కాళ్లు విరిగినట్లు సమాచారం. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.