www.ntodaynews.com
రైతులు గడువులోగా పంట బీమా నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
రైతులు గడువులోగా పంట బీమా నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న పంటలకు పంట బీమా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులు పంట బీమా చేసుకోవడంపై దృష్టి సారించాలని తెలిపారు.
పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు పంట బీమా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అధిక వర్షాలు, కరువు, తుఫానులు తదితర కారణాలతో పంట నష్టం జరిగితే పంట బీమా పథకం ద్వారా పరిహారం పొందేందుకు రైతులు గడువులోగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు పంట బీమా నమోదు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఆగస్టు 15లోగా పంట బీమా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.