www.ntodaynews.com
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్
తెలంగాణ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
NTODAY NEWS: యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు శనివారం రోజున మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పాటశాలల్లో తనిఖీ చేస్తున్న సందర్భంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో వండిన కూర బాగోలేదని ఎమ్మెల్యే కి తెలుపగా వంట మనుషులను మందలించారు ఈ సందర్భంగా లో మధ్యాహ్న భోజనం ఇంచార్జి ఎవరు అని అడుగగా అక్కడకి వచ్చిన టీచర్ ను బీర్ల అయిలయ్య కూర బాగోలేదని మండిపడ్డారు, దీంతో ఆ టీచర్ వినూత్నమైన రీతిలో, వెలుచుపుతూ బీర్ల అయిలయ్యకి సమాధానం ఇచ్చింది. దీంతో మన విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని అనడంతో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పైన ఆ టీచర్ దురుసుగా మాట్లాడింది. దురుసుగా మాట్లాడిన టీచర్ పై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకోవలన్నారు. అనంతరం క్లాస్ రూమ్ లో విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు రోజు పాఠశాలకు రెగ్యులర్ గా వస్తున్నారా, చదువు ఎలా చెపుతున్నారో అడిగి తెలుసుకున్నారు పలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులు తెలుపగా సొంత నిధులతో వాటి మరమ్మతులు చేయించాలని స్థానిక నాయకులకు ఎమ్మెల్యే తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube