www.ntodaynews.com
మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం అందజేత.
కొండమడుగు గ్రామంలోని సర్వే నెంబర్ 427,428,429,437లో గల 300 మంది పైగా ప్లాట్ ల బాధితులకు న్యాయం చేయాలని మేఘన ఎస్టేట్లోని కరీంనగర్ ప్రాంతానికి చెందిన బాధితుల తరపున,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని ఈరోజు ఉదయం కరీంనగర్ లోని తన నివాసంలో కడెం సాయిలు, భువనగిరి స్వామి గౌడ్ కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందుకు గాను బాధితులకు న్యాయం చేయడానికి తన వంతు సహాయం సహకారం అందిస్తానని బండి సంజయ్ కుమార్ తెలపడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో సర్ధార్ సింగ్ ఠాగూర్ , G.M రాములు , నర్సయ్య , జక్కుల నర్సింహులు ,N శ్రీహరి తదితరులు పాల్గొన్నారు