పొలంలోనే కేటీఆర్ జన్మదిన వేడుకలు.. రైతు చెమటకు గౌరవం అంటూ బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వ్యవసాయ క్షేత్రంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ భీశ్వ మాధవి–రామకృష్ణ దంపతుల పొలంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు చెమటకు గౌరవం తెలిపే ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజాసేవలో కేటీఆర్ మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, రాంబాల్ నాయక్, రాజవరప్రసాద్, రాజ్యలక్ష్మితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ పీఎసీఎస్ చైర్మన్లు, మండల, గ్రామ, వార్డు స్థాయి పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.