www.ntodaynews.com
శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గుప్త నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన శ్రీ వారాహి అమ్మవారిని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ దర్శించుకున్నారు. గుప్త నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గాదె సత్యం గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, వేద పండితులు నాయకులకు అమ్మవారి శేషవస్త్రాలు బహుకరించి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు