కాశీ విశ్వేశ్వర ఆలయంలో 27 కిలోల చక్కెరతో మహా లింగాభిషేకం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
శ్రావణమాస చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు.. భక్తులతో కాశీబుగ్గ ఆలయం కిటకిట
వరంగల్ | Ntoday News
వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణమాసంలోని పవిత్రమైన చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి 27 కిలోల చక్కెరతో మహా లింగాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.