మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఏప్రిల్ 19: మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మార్గదర్శకత్వంలో, కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జి, ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్ మరియు శ్రీరాంపూర్ కాలనీ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులు, సామాన్య ప్రజల సౌకర్యార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు