BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి..

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 12:34 PM
45 వీక్షణలు

​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ఎండిపోయిన బావులు, అల్లాడుతున్న ప్రజలు!

​దండేపల్లి, ఏప్రిల్ 19:

దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ఈడిగేవాడ కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. వేసవి ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, గ్రామంలోని బావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఒక్క బావిపైనే వందలాది మోటార్లు వేసి నీటిని తోడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది.

​తమ ప్రాంతంలో నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, తక్షణమే స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తమ కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు