పోతనపల్లి ఎంపీపీ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ డే వేడుకలు
ఏలూరు జిల్లా, చాట్రాయి: చాట్రాయి మండలం పోతనపల్లి ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శివాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం ద్వారా ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
నూజివీడు శాసనసభ్యులు, మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి, ప్రతి విద్యార్థికి ఎలాంటి వివక్ష లేకుండా తల్లికి వందనం పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు, మంగయ్య, వెంకటేశ్వరరావు, సదకరరావు, మల్లికార్జునరావు, ఏసుబాబు, కృష్ణప్రసాద్, వెంకట సీతారామయ్య, చిన్న సోమ్లు, ప్రధానోపాధ్యాయుడుసంజీవ కుమార్, ఉపాధ్యాయుడు రవీంద్ర, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.