www.ntodaynews.com
పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘం సభ్యుడై ఉన్న కొంకోళం సీతారామరాజు (నల్ల తాతయ్య) గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపధ్యంలో, ఆయన భార్య కంకోలం సరోజినీకి పోలవరం సొసైటీ తరఫున సొసైటీ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు పదివేలు రూపాయలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు పాపన్న, జానకి రామయ్య, వార్డు మెంబర్ మోరంపూడి శేఖర్ రాజు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.