www.ntodaynews.com
ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
తెలంగాణ
/
నల్గొండ
ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ NTODAY NEWS చిట్యాల
మండుతున్న ఎండల దృష్ట్యా నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామ ఉపాధి హామీ కూలీల దాహార్తిని తీర్చేందుకు సోమవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో, గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూలీల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించిన నాయకులకు కూలీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, జన్నపాల రేణుక, రాచమళ్ళ సంధ్య, గురిజ మమత, రూపని వనజ, ఉయ్యాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.