తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ
తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. తల్లి–కొడుకు ఇద్దరూ ఒకేసారి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఆరవ తరగతిలోనే చదువు మానేసిన బండారు లక్ష్మీలహరి, ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చదువు పట్టాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు విజయ్ రెగ్యులర్గా పరీక్షలు రాస్తుండగా, తాను ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాల్లో కుమారుడు 600 మార్కులకు 562 మార్కులు సాధించగా, తల్లి 500 మార్కులకు 360 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలయ్యారు. ఫలితాలు చూసిన తల్లీకొడుకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఏళ్ల తర్వాత పుస్తకం పట్టుకుని విజయం సాధించిన లక్ష్మీలహరి కథ ప్రస్తుతం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చదువుకు వయసుతో సంబంధం లేదని ఆమె మరోసారి నిరూపించారు.