BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:46 PM
99 వీక్షణలు

తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. తల్లి–కొడుకు ఇద్దరూ ఒకేసారి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆరవ తరగతిలోనే చదువు మానేసిన బండారు లక్ష్మీలహరి, ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చదువు పట్టాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు విజయ్ రెగ్యులర్‌గా పరీక్షలు రాస్తుండగా, తాను ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాల్లో కుమారుడు 600 మార్కులకు 562 మార్కులు సాధించగా, తల్లి 500 మార్కులకు 360 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలయ్యారు. ఫలితాలు చూసిన తల్లీకొడుకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

ఏళ్ల తర్వాత పుస్తకం పట్టుకుని విజయం సాధించిన లక్ష్మీలహరి కథ ప్రస్తుతం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చదువుకు వయసుతో సంబంధం లేదని ఆమె మరోసారి నిరూపించారు.