www.ntodaynews.com
600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు
తెలంగాణ
600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు
10వ తరగతి ఫలితాల్లో ఈసారి ప్రతిభావంతులైన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. మొత్తం 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి నలుగురు విద్యార్థులు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. ఖమ్మానికి చెందిన వృతికా కృష్ణ, రంగారెడ్డి జిల్లా విద్యార్థి మేధాన్ష్ శ్రీరామ్, సంగారెడ్డి జిల్లాకు చెందిన శశాంక్, మధు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఇక మరో ఆరుగురు విద్యార్థులు — లలిత్, సాత్విక్, రిత్విక, సాయి కవిత, చంద్రహాస్, ప్రణవ్ — 596 మార్కులు సాధించి టాప్ ర్యాంకులకు సమీపంగా నిలిచారు. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ప్రతిభ మరోసారి రుజువైంది.
ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15%గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.