www.ntodaynews.com
10th రిజల్ట్స్.. ట్విన్స్కు సేమ్ మార్కులు
తెలంగాణ
/
నల్గొండ
10th రిజల్ట్స్.. ట్విన్స్కు సేమ్ మార్కులు
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో 10వ తరగతి ఫలితాలు ఆసక్తికర ఘట్టానికి వేదిక అయ్యాయి. కవల పిల్లలైన శ్రీరామ్, లోకేష్ ఇద్దరూ ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మండలానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగి, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తిరుమలగిరి సాగర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు, తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రత్యేకత చాటుకున్నారు.
ఒకే విధంగా చదివి, ఒకే లక్ష్యంతో ముందుకు సాగిన ఈ ట్విన్స్ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.