www.ntodaynews.com
విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో HMC హిందూ ముస్లిం క్రిస్టియన్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కె.లక్ష్మీ కళ్యాణికి అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ, స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు ఆటోనగర్ అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నూరుద్దీన్, కార్యదర్శి షేక్ హుస్సేన్, సహాయ కార్యదర్శి సిరాజ్ బాబు, వైస్ ప్రెసిడెంట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.