www.ntodaynews.com
మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం
తెలంగాణ
మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవతాపురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోసిన పొలంలో నిల్వ ఉంచిన వరి ధాన్యం అకస్మాత్తుగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో సుమారు 50 బస్తాల వరి పూర్తిగా కాలిపోయాయి.
అగ్ని వ్యాపించడంతో పక్కనే ఉన్న మామిడి తోటకు కూడా మంటలు అంటుకుని రెండు ఎకరాల విస్తీర్ణంలో చెట్లు దగ్ధమయ్యాయి. అదేవిధంగా బోరు పైపులైన్, కేబుల్ వైర్లు కూడా పూర్తిగా కాలిపోయి రైతుకు తీవ్ర నష్టం కలిగింది.
ఈ అగ్నిప్రమాదంతో ఆర్థికంగా నష్టపోయిన రైతు, ప్రభుత్వం తక్షణమే స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.