వాట్సప్లోనే సదరం సేవలు.. దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం
వాట్సప్లోనే సదరం సేవలు.. దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం
అమరావతి: దివ్యాంగులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారా ఇకపై సదరం సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
దివ్యాంగులు 9552300009 నంబర్కు "Hai" అని సందేశం పంపి సదరం స్లాట్ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అలాగే సదరం ధ్రువీకరణ పత్రాలను నేరుగా వాట్సప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఈ డిజిటల్ సేవలతో కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గి, సమయం ఆదా కావడంతో పాటు సేవలు మరింత పారదర్శకంగా అందనున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీజీఎస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.