BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 08:34 AM
30 వీక్షణలు

ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు

సెప్టెంబర్ 28లోగా వివరాలు సరిచేసుకోవాలి.. లేదంటే ఓటు తొలగింపు

అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 44.89 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత, మరో 44.21 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తోంది.

ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న కొందరు ఓటర్ల వివరాలు 2002 నాటి ఓటరు జాబితాలోని వారి పేరు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల వివరాలతో సరిపోలలేదు. మరికొందరి వివరాల్లో తప్పులు గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఓటర్లు సెప్టెంబర్ 28వ తేదీలోగా తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ)ను సంప్రదించి అవసరమైన ఆధారాలు సమర్పించి వివరాలను సరిచేసుకోవాలి.

సరైన వివరాలు అందించి ధ్రువీకరణ పూర్తి చేసుకున్న వారి పేర్లు తుది ఓటరు జాబితాలో కొనసాగుతాయి. గడువులోగా స్పందించని వారి పేర్లు తుది జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటు హక్కు కొనసాగించుకోవాలంటే ప్రతి ఓటరు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.