అమరావతి: స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తి....
అమరావతి: స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తి.. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు
అమరావతి: మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమం నిర్వహించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి క్యాంపు కార్యాలయం వరకు పల్లె వెలుగు బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న అనుభవాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మహిళలతో కలిసి హై-టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల సాధికారత, ఆత్మగౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.