సిపిఐ ఆధ్వర్యంలో లెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం
భారత కముయనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు కూటిమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి, ఐదు లక్షల రూపాయలు సాయం అందించాలని టిట్కో ఇల్లలను పూర్తి చేసి లబ్దారులకు అందించాలని అర్హులైన వారికి పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వాలి పట్టణాల్లో గ్రామాల్లో దళిత వాడల్లో స్మశాన వాటికలో ఏర్పాటు చేయాలని పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి సోమందేపల్లి సిపిఐ మండల కార్యదర్శి రాజగోపాల్ సహాయ కార్యదర్శిలు ఎస్ చాంద్ బాషా అంజనమ్మ సిపిఐ మండల నాయకులు శీలా నారాయణస్వామి మల్లేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు