పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య
పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.
"ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి ఇంటికీ భరోసా అందించడమే మా ధ్యేయం" అని వాసం మునియ్య తెలిపారు.