ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు
పెన్షన్ల లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. జూన్ నెల నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కోసం రూ.2,728 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా అర్హత సాధించిన వితంతువులకు ఈ నెల నుంచే పెన్షన్ అందనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జూన్ 12న మరిన్ని లక్షల మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా పలు వర్గాల ప్రజలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది.
"అర్హులందరికీ సంక్షేమ ఫలాలు" లక్ష్యంగా ప్రభుత్వం పెన్షన్ పంపిణీని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.