BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

​శ్రీ విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 06:58 PM
77 వీక్షణలు

 ​శ్రీ విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించాలి: జిల్లా కలెక్టర్‌కు ‘బీసీ సమాజ్’ వినతి

మంచిర్యాల  పట్టణంలోని ప్రముఖ శ్రీ విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని, అలాగే పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ చైర్మన్ పదవిని అనేక సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  

​భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 38, 46 స్ఫూర్తికి అనుగుణంగా ఆలయ పాలకమండలి నియామకాల్లో సమాన అవకాశాలు, పారదర్శకత, సామాజిక న్యాయం పాటించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జరిగిన నియామకాలపై సమీక్ష నిర్వహించి, రాబోయే పాలకమండలిలో చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించేలా దేవదాయ శాఖకు తగిన సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మణ్, నాయకులు పెద్దపెల్లి సూరయ్య, చల్ల విజయ్ కుమార్, కొండ రాజు, కుడుక మోహన్ తదితరులు పాల్గొన్నారు