BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 16 July 2026, 07:12 pm
Posted by : కూనురు మధు

విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణ అలవర్చుకోవాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Jul, 2026 - 07:12 PM
204 వీక్షణలు
విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణ అలవర్చుకోవాలి 

విద్యార్థి దశ నుండి నీటి సంరక్షణ సంబంధించిన అలవాట్లను అలవర్చుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్  ఆదేశాల మేరకు, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక గ్రీన్ గ్రోవ్ స్కూల్‌లో "క్యాచ్ ది రైన్" (వాన నీటిని పట్టుకుందాం) పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.  ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, మున్సిపల్ కమిషనర్ గురులింగం, వైస్ ఛైర్పర్సన్ గుండెబోయిన లక్ష్మీ సైదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి బొట్టు వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం మన అందరి బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలని, పాఠశాలల్లోనూ, ఇళ్లలోనూ వాన నీటిని వృథా కాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరారు. ​ వర్షం పడినప్పుడు ఆ నీరు డ్రైనేజీల్లో కలవకుండా, చెట్లు లేదా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చూడాలి అని సూచించారు. ప్రతి విద్యార్థి బ్రష్ చేసేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు ట్యాప్‌లను అనవసరంగా తెరిచి ఉంచకూడదు  తెలిపారు . కూరగాయలు, బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పోయడం అలవాటు తీసుకోవాలని తెలిపారు ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బొబ్బలి సందీపారామ్ రెడ్డి, ఏర్పుల పరమేష్, దేశపాక లతా రాజేష్,  కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, గ్రీన్ గ్రోవ్ పాఠశాల ఏవో పోల  గోవర్ధన్ , విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు